VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణ తాపడం పనులను శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆలయ ఈవో జె. వెంకట్రావు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.