AP: రాజకీయ చతురతతోనే తాను ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్లు మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ‘సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోను. కుటుంబాన్ని రిస్క్లో పెట్టడం లేదు. నన్ను ఎవరూ కొట్టలేదు.. కొడితే చెప్పుకోవడానికి వెనుకాడను. నాపై కేసు పెట్టాలని చంద్రబాబు అన్నారని తెలిసింది. కానీ, పెమ్మసానికి నచ్చక లోకేష్ను కలిశారని విన్నా’ అని తెలిపారు.