TG: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మరో రూ. 640 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటితో రాష్ట్రానికి 2024-25 ఆర్థిక సంవత్సరం నిధులు పూర్తిగా అందగా.. 2025-26 ఆర్థిక సంవత్సరం కింద మరో 1,255 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. వీటిని కూడా విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.