ATP: డి. హీరేహల్ మండలం మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ద ఆంజనేయుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. వేకువజామునే స్వామి మూల విరాట్కి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలు, తమలాపాకుల హారాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.