AP: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధిని చూసి YCP చీఫ్ జగన్ ఓర్వలేకపోతున్నారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ విమర్శించారు. తమ పాలనలో విచ్చలవిడిగా అప్పులు చేసి, రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్నారని ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా AP నిలుస్తున్న వేళ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.