ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ప్రభుత్వం తక్షణం రూ.2 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు సీపీఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్లుగా పాలక పార్టీలు ప్రాజెక్టును ఓటు బ్యాంకుగా మలుచుకుని లబ్ధి పొందుతున్నాయే తప్ప పూర్తి చేయలేదన్నారు.
ASR: పాడేరు మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు.
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి వ్యతిరేకంగా ఈనెల 14 నుంచి 20 వరకు గుంతకల్లు పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడదామని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం సీపీఎం కార్యాలయంలో వామపక్ష పార్టీ నాయకులతో కలిసి రౌండ్ టెబుల్ సమావేశం నిర్వహించారు.
NDL: పగిడ్యాల మండలంలోని ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి రెండు పైపుల ద్వారా 450 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువకు విడుదల చేసినట్లు సంబంధిత ఏఈ నరేష్ తెలిపారు. కెసీ కాలువలో నీటిమట్టం తగ్గిపోవడంతో అయుక్తత రైతులు పంటలు ఎండిపోతున్నాయి అని ఆందోళన చెందడంతో రైతుల సౌకర్యాలు కేసి కాల్వకు నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
NLR; నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సాయంత్రం మాఘ పౌర్ణమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. విశేష పుష్ప అలంకరణ, మంగళ వాయిద్యాలు, వేద పండితుల నడుమ శ్రీవారికి గరుడ సేవా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ASR: గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల పరిధిలోని గ్రామాలన్నింటినీ పర్యవేక్షణ చేశామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం తెలిపారు. జర్రెల పంచాయతీ ప్రధాన రహదారి నుంచి మిగిలిన గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాగే అక్కడ మధ్యలో కొండవాగుపై వంతెన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ASR: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. బుధవారం గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల ప్రాంతంలో పర్యటించారు. ఈ ఏడాది గంజాయి తగ్గుముఖం పట్టిందని అన్నారు. జిల్లా కలెక్టర్ సహకారంతో పోలీస్ శాఖ తరఫున గిరిజనులకు అండగా ఉంటూ, గిరిజన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తుందని తెలిపారు.
KRNL: వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించాలని సీఐటీయు ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మిగనూరులో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్యకి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి రాముడు, గ్రామ వార్డు వాలంటర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సురేష్, అధ్యక్షురాలు శిరీష మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వాలెంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు.
SRCL: రాజన్న సిరిసిల్ల పట్టణంలో పౌష్టికాహారం, వాష్ కార్యక్రమాలపై బుధవారం అవగాహన నిర్వహించినట్టు డీఆర్డీవో గొట్టే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన నుంచి 1,000 రోజుల ప్రణాళిక చేతుల శుభ్రంగా కడుక్కోవడం, పెరటి కోళ్ల పెంపకం వంటి వాటిపై శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు.
CTR: జిల్లాలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలతో పాటు సమగ్ర వివరాలను క్రోడీకరించే విధంగా రూపొందించిన ‘లోకోస్ యాప్’ సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. బుధవారం చిత్తూరులోని జిల్లా సమాఖ్య సమావేశంలో జిల్లాలోనీ అకౌంటెంట్ల సమావేశం జరిగింది. యాప్ ఉపయోగం గురించి వివరించారు.
NDL: బీసీ కార్పొరేషన్ కింద 50% సబ్సిడీతో అందించే రుణాల మంజూరుకు ప్రభుత్వం మరోసారి దరఖాస్తు గడువు పొడిగించినట్లు సంజామల ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. ఇవాల్టితో గడువు ముగుస్తుండగా.. ప్రభుత్వం ఈనెల 15 వరకు పొడిగించిందన్నారు. 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. BC(A)-23, BC(B)-14, BC(D)-7, BC(E)-11, EBC-4 ఉన్నట్లు వెల్లడించారు.
KRNL: ఎమ్మిగనూరు మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైన కడిమెట్ల గ్రామంలో జరుగుచున్న రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ నవ్వ, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవ్వ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి పాల్గొన్నారు.
KMM: మధిర మండల కేంద్రంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ పోటీలలో మధిర టీవీఎం ప్రభుత్వ పాఠశాల, మడుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు పోటీల నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
BDK: బీసీల హక్కులను రక్షించేందుకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కేటాయిస్తూ చట్టం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొదమూరు సత్యనారాయణ ప్రభుత్వాన్ని బుధవారం డిమాండ్ చేశారు. బీసీలు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్ అమల దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.