పల్నాడు: అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇచ్చే మందులను పరిశీలించి ఆసుపత్రికి సరఫరా అవుతున్న మందుల వివరాలను ఎమ్మెల్యేకు సిబ్బంది విచారించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.