• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పిన్నెల్లి శవ రాజకీయాలు మానుకోవాలి

PLD: మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వీరాస్వామి అన్నారు. మాచర్ల మండలం పసువేములలో మామ అల్లుళ్ల మధ్య భూ వివాదంలో 4 నెలల క్రితం అల్లుడిని మామ గొడ్డలితో నరికితే ఇప్పటికీ అల్లుడు కోమాలో ఉన్నాడన్నారు. ఆ కక్ష్యతో అల్లుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు మామను హత్య చేసి చంపారన్నారు.

April 5, 2025 / 07:00 PM IST

మర్రిపాడు మండలంలో పర్యటించనున్న మంత్రి ఆనం

NLR: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 7వ తేదీన సోమవారం మర్రిపాడు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

April 5, 2025 / 06:55 PM IST

పెంచలకోన స్వామివారికి విశేష పూజలు

NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

April 5, 2025 / 06:20 PM IST

రైలులో దోపిడి.. దూకుడు పెంచిన పోలీసులు

NLR: కావలి జీఆర్పీఎఫ్ పరిధిలోని అల్లూరు రోడ్డు పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజుల క్రితం దుండగులు రైలు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి ప్రయాణికుల నుంచి బంగారం, నగదును దోచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శనివారం రైల్వే SP రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని రైలు ఆగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

April 5, 2025 / 05:35 PM IST

కత్తులు చూపించి 3.7 కిలోల బంగారం చోరీ

AP: చిత్తూరులోని వెంకటగిరికోటలో 3.7 కిలోల బంగారం దోపిడీ జరిగింది. తమిళనాడులోని వేలూరు నుంచి కర్నాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా దుండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కారును అడ్డగించి కత్తులు చూపించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

April 5, 2025 / 05:27 PM IST

కలకలం రేపిన యువకుడు మృతి

కృష్ణా: ఫోన్ కాల్ వచ్చిందని ఇంటి నుంచి బయటకి వెళ్లి మృత్యువాత పడ్డ యువకుడి మృతి కోడూరు మండలంలో కలకలం రేపింది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన లక్ష్మీ వర్ధన్(22) బీటెక్ పూర్తిచేశాడు. తన స్నేహితులతో కలిసి కేటరింగ్ పనులకు వెళుతూ ఉంటాడు. కానీ అనుకోని విధంగా ఇలా మరణించి శవమై కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

April 5, 2025 / 05:21 PM IST

సీఎం రేవంత్‌కు మంత్రులు కీలక ప్రతిపాదన

TG: కంచ గచ్చిబౌలి భూవివాదంపై CM రేవంత్ రెడ్డికి మంత్రులు కీలక ప్రతిపాదనలు అందించారు. ఆ భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని.. బర్డ్ పార్క్, బటర్ ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, లేక్స్ అండ్ గార్డెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆ 400 ఎకరాలతో పాటు మరో వెయ్యి ఎకరాలు సేకరించాలని, ఎకో పార్క్‌కు రాజీవ్ పార్క్‌గా పేరు పెట్టాలని ప్రతిపాదించారు.

April 5, 2025 / 05:20 PM IST

ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం: డీఈవో

MDK: తూప్రాన్ మండలం పడాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన భూపతిరెడ్డి పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో రాధాకిషన్ పాల్గొన్నారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సమయపాలన పాటించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చి దిద్దాలన్నారు.

April 5, 2025 / 05:19 PM IST

సీమ రాజాపై చర్యలు తీసుకోవాలి

GNTR: టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సీమ రాజాపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేమారెడ్డి పేర్కొన్నారు.

April 5, 2025 / 05:17 PM IST

CSK vs DC: చెన్నై టార్గెట్ ఎంతంటే?

చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. DC బ్యాటర్లలో కేఎల్ రాహుల్‌ (77), పొరేల్ (33), అక్షర్ పటేల్ (21), రిజ్వీ (20), స్టబ్స్ (24) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 183/6 పరుగులు చేసింది. ఇక CSK బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. CSK టార్గెట్ 184.

April 5, 2025 / 05:14 PM IST

నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎస్పీ

KRNL: జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిదాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ తెలిపారు. డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు బృందాలుగా ఏర్పడి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

April 5, 2025 / 05:04 PM IST

క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి పట్టణం శరభయ్య హై స్కూల్ గ్రౌండ్‌లో పోలీస్ శాఖ, బార్ అసోసియేషన్ సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్‌ను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఇలా ఆటల ద్వారా ఉద్యోగ భారం నుంచి విశ్రాంతి తీసుకుని, పరస్పర సహకారం పెరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

April 5, 2025 / 04:19 PM IST

కాలుష్యానికి ఆవాసంగా కేసీ కెనాల్

KRNL: కర్నూలులోని అతి పురాతనమైన కేసీ కెనాల్ కాలుష్యానికి గురవుతోంది. చెత్తాచెదారం, మురికితో నిండిపోయింది. దోమలకు ఆవాసంగా మారిపోయింది. కాలువ నుంచి దుర్గంధాలు వెదజల్లుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలకు ఆవాసంగా మారిందని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

April 5, 2025 / 04:02 PM IST

రాష్ట్రస్థాయిలో ప్రశంసలు పొందిన రాజంపేట చిత్రకారుడు

KDP: రాజంపేట పట్టణం బోయపాలెంకు చెందిన ప్రముఖ చిత్రకారుడు నాయిని గిరిధర్ చిత్రలేఖన రంగంలో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హస్తకళ చిత్రలేఖన ప్రదర్శనలో సుమారు 500 మంది కళాకారులు పాల్గొనగా వారిలో నాయిని గిరిధర్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

April 5, 2025 / 04:00 PM IST

ప్రమాదల నివారణకు చర్యలు చేపట్టాలి: DYFI

KDP: జమ్మలమడుగులోని స్థానిక మెయిన్ బజార్ కూడలిలో గుంతను పూడ్చి అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని DYFI జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య తెలిపారు. శనివారం కూడలిలో ప్రమాదకరంగా ఉన్నగుంతను DYFI నాయకులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. నిత్యం రద్దీగా ఉండే కూడలి మధ్యలో గుంత ఉండటంతో వాహనదారులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

April 5, 2025 / 03:30 PM IST