CTR: జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాన్ని ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు జడ్పీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. 1 నుంచి 7 స్థాయి సంఘాలతో ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై సమావేశం ఉంటుందని వివరించారు.