ATP: తాడిపత్రి మున్సిపాలిటీ పాలక వర్గం గడువు ముగియడంతో ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. దేవాలయం లాంటి కార్యాలయాన్ని వీడాల్సి రావడం బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐదేళ్ల కాలంలో తాడిపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కౌన్సిలర్లు, అధికారులు అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.