MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని కంటాయపాలెం రోడ్డు (ఛాంబర్ కామర్స్ భవనం) ఎదుట కాలనీకి వెళ్లే రోడ్డులో డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి పరిసరాలను కలుషితం చేయడంతో దుర్వాసన వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ సిబ్బందికి తెలిపినప్పటికీ పట్టించుకోవట్లేదన్నారు.