PLD: మంత్రి నారా లోకేశ్ను ఉండవల్లిలోని నివాసంలో పల్నాడు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన మంత్రితో చర్చించారు. కాగా, కొమ్మాలపాటి వరుసగా పెదకూరపాడు నియోజకవర్గం టికెట్ ఆశించినా రాకపోవడంతోపాటు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పదవి కూడా పోవడంతో ఆయన సన్నిహితులు నిరాశలో ఉన్నారు.