AP: కృష్ణా జిల్లా యనమలకుదురులో పడమట పీఎస్ ఏఎస్ఐ వీరవల్లి గోపి వెంకట దుర్గాప్రసాద్ మృతదేహం లభ్యమైంది. ఒక కేసు విషయంలో 15 రోజుల క్రితమే ఆయన సస్పెన్షన్కు గురయ్యారు. తాజాగా ఆయన విగతజీవిగా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.