CTR: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఇవాళ వెలుగు చూసింది. గ్రామస్తుల కథనం మేరకు.. కంభం వారి పల్లి పంచాయతీ గాండ్ల పల్లెకు చెందిన మోహన్ బాబు (26) వ్యవసాయ పొలాల వద్ద మోటర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం బావిలోపడ్డాడు. ఇవాళ అతని మృతదేహాన్ని గుర్తించి స్థానికులు వెలికి తీశారు.