TG: డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేవలం నిజమైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు అందాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, కోర్టుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.