MDK: మెదక్ నుంచి సుమారు 80 మంది ప్రయాణికులతో బొడ్మట్పల్లి వెళ్తున్న RTC బస్సుకు టేక్మాల్ వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఒక్కసారిగా ముందు టైరు పగిలిపోవడంతో డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వాహనాన్ని సురక్షితంగా నిలిపివేశారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.