GNTR: హాస్టల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఒత్తిడికి గురికాకుండా చూడాలని వట్టిచెరుకూరు బీసీ హాస్టల్ యాజమాన్యానికి మంత్రి సవిత బుధవారం సూచించారు. టెన్త్ విద్యార్థి రాకేశ్ ఆత్మహత్య ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి కుటుంబానికి ఆమె సానుభూతి తెలిపారు.