TG: అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. మొదటి దశ అంచనా వ్యయం రూ.7వేల కోట్లు అని, 1,438 నిర్మాణాలు ప్రభావితమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. మెయిన్హార్ట్ కంపెనీకి DPR కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. గతంలో 18 నెలలు పడుతుందన్న DPR, ఇంత తక్కువ కాలంలో ఎలా తయారైందని ప్రశ్నించారు.