KRNL: ఆదోని మండల పరిషత్ భవనంలో బుధవారం ఎంపీపీ దానమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO నాగరాజు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ప్రధానంగా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.