TG: మూసీ పరివాహక ప్రజలు తీవ్ర అపరిశుభ్ర వాతావరణంలో జీవిస్తున్నారని, వారి బతుకులు మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు. మూసీని నగరానికి మణిహారంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షం ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. పేదల జీవనగతులు మార్చే గొప్ప ప్రాజెక్టును రాజకీయాల కోసం వ్యతిరేకించడం సరికాదని ఆయన హితవు పలికారు.