కోనసీమ: అమలాపురం మండలం మున్సిపల్ కాలనీ వెనుక ఉన్న శ్మశానంలో పేకాట శిబిరంపై పట్టణ ఎస్సై NR కిషోర్ బాబు సిబ్బందితో కలిసి నిన్న రాత్రి మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న కాలాడి వెంకటేశ్, తాళ్ల భగవాన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,050 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జూదాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.