ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ పాయింట్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.