SDPT: నంగునూరు మండలంలో అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాతావరణ మార్పులతో ఇప్పటికే పూత రాలిపోగా, తాజా గాలివానకు పిందెలు నేలరాలాయి.ఈసారి ఉగాది పండుగ ముందుగా రావడంతో కాయల సైజు కూడా పెరగలేదు. స్థానిక తోటల్లో పంట దెబ్బతినడంతో, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే మామిడి కాయలతోనే ఉగాది పచ్చడి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.