VKB: పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి. మంగళవారం అర్ధరాత్రి మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఈ రాళ్ల వాన ధాటికి వలస వచ్చిన కాపరుల 150 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకలు చనిపోవడంతో జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని కాపరులు కోరుతున్నారు.