కృష్ణా: గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది. ఇంటి తాళం పగులకొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు వస్తువులను చిందర వందరగా చేశారు. హైదరాబాద్కు వెళ్లి ఇవాళ తిరిగి వచ్చిన ఆయన భార్య మధురిమ ఘటనను గుర్తించి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశపారంపర్యంగా ఉన్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు తెలిపారు.