కాకినాడ: డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా బుధవారం సామర్లకోట రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నిర్మిత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. స్టేషన్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు డీఆర్ఏంకు ఘన స్వాగతం పలికారు.