AP: దివ్యాంగ శక్తి పథకం అమలుకు శ్రీకారం చుట్టిన సీఎంకు మంత్రి DSBV స్వామి ధన్యవాదాలు తెలిపారు. ఈ పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని అన్నారు. విశాఖలో రూ.200 కోట్లతో అత్యాధునిక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్, దివ్యాంగులకు రుణ రాయితీ పథకాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.