ప్రకాశం: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని అర్ధవీడు ఎస్సై శివనాంచారయ్య తెలిపారు. బుధవారం అర్ధవీడులోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.