ATP: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం నుంచి అమలు చేయనున్నట్లు గుంతకల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఖాజావలి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు జీరో చార్జి ఉచిత టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులకు జారీచేసిన బస్ పాస్ ఐడి కార్డులను చూపించాలన్నారు.