NLG: అధిక వడ్డీ పేరుతో రూ.40 కోట్లు వసూలు చేసిన కేసులో నాగార్జునసాగర్ పోలీసులు వాడిత్య భీమా, రమేశ్, శేఖర్, సురేష్ను అరెస్ట్ చేశారు. నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలతో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొబైళ్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.