E.G: సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల్లో రవాణా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉండగా, మిగతా కాలంలో పడవలే ఆధారమని గ్రామస్థులు చెబుతున్నారు. రూ.35 కోట్లతో ప్రారంభించిన వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ఇబ్బందులు పెరిగాయి. వరద సమయంలో ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.