HYD: సికింద్రాబాద్ నుంచి వెళ్లే అనేక రైళ్లలో ఆక్యుఫెన్సీ రేషియో పెరుగుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గుర్తించింది. ఈ మేరకు ఒక్కోసారి స్పెషల్ రైలులను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా పేర్కొంది. పండుగ సమయాల్లో ప్రతి ఏడది 6 శాతం వరకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండగా, సాధారణ పరిస్థితుల్లో 4 శాతం వరకు పెరుగుతున్నట్లు ఓ రిపోర్టులో వివరించారు.