SRD: నిర్మల్ జిల్లా బాసర RJUKTలో పీయూసీ-2 చదువుతున్న సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన మల్లిపూడు తేజస్విని అనారోగ్యంతో మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఇంటి వద్దే చికిత్స పొందుతూ కన్నుమూసింది. విద్యార్థిని అకాల మరణం పట్ల విశ్వవిద్యాలయ యంత్రాంగం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.