NLR: ఆత్మకూరులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 70 మందికి రూ.44.63 లక్షల చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం అందించారు. అలాగే ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి పార్టీ సభ్యత్వం ఉండి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి అందించారు.