• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్టులో సాయిపల్లవి?

సాయిపల్లవి బాలీవుడ్ లెజెండరీ నటి మధుబాల బయోపిక్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించినట్లు టాక్. ఇప్పటికే కియారా అద్వానీ, అనీత్ పడ్డా పేర్లు వినిపించినా, తాజా అప్‌డేట్‌తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆమె తొలి హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ మే 2026లో విడుదల కాకముందే ఈ భారీ ఆఫర్ రావడం విశేషం.

March 15, 2026 / 03:15 PM IST

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వినతి

VZM: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెప్మా, సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ పాలసీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఏపీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ కోరింది. ఈ మేరకు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ జై మహేంద్ర బాబు ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.

March 15, 2026 / 03:14 PM IST

నన్నూరులో అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమం

KRNL:  ఓర్వకల్లు (M) నన్నూరులోని ఎంపీపీ స్కూలులో అక్షరాంద్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు APM వెంకటరామిరెడ్డి తెలిపారు. వయోజన అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మహిళా విద్యను ప్రోత్సహించి వారిని సామాజిక సాధికారత వైపు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.

March 15, 2026 / 03:13 PM IST

‘పన్నులు చెల్లించి.. పంచాయతి అభివృద్ధికి సహకరించండి’

KDP: ఈనెల 31 లోపు ఇంటి, నీటి పన్నులు తప్పక చెల్లించాలని ఇంఛార్జ్ ఎంపీడీవో వీరభద్రుడు పేర్కొన్నారు. ఆదివారం ముద్దనూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పన్నులు చెల్లించి గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను, వ్యాపారవేత్తలను కోరారు. పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

March 15, 2026 / 03:12 PM IST

పరిగిలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా

సత్యసాయి: పరిగి మండలంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా కార్యక్రమం చేపట్టారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమయ్య ఆధ్వర్యంలో వేసవిలో ప్రజలు త్రాగునీటి కొరతతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టి నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

March 15, 2026 / 03:12 PM IST

ఫాదర్ కొలంబో జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ MLA

HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో ఫాదర్ కొలంబో 100వ జయంతి వేడుకలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ MLA డా.తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ కొలంబో చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.

March 15, 2026 / 03:12 PM IST

‘కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి’

NLG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అమలు చేయబోమని తీర్మానం చేయాలని, రాష్ట్రంలోని కార్మికుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ నల్గొండ జిల్లా 13వ మహాసభల్లో ఈ డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

March 15, 2026 / 03:11 PM IST

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

కోనసీమ: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. జిల్లాలో రౌడీయిజం అణిచివేతకు రౌడీ షీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ రౌడీ షీటర్ల ప్రవర్తనను సమీక్షించి, పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

March 15, 2026 / 03:10 PM IST

రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్

కోనసీమ: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. జిల్లాలో రౌడీయిజం అణిచివేతకు రౌడీ షీటర్లకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ రౌడీ షీటర్ల ప్రవర్తనను సమీక్షించి, పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

March 15, 2026 / 03:10 PM IST

మైనర్ బాలిక మిస్సింగ్ పై కేసు నమోదు: SI

WG: మొగల్తూరు మండలంలో 17 ఏళ్ల మైనర్ బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి బయటకు వెళ్లిన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పరిసరాల్లో గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు SI జి. వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

March 15, 2026 / 03:09 PM IST

BREAKING: ప్రమాదం.. నలుగురు మృతి

TG: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ వద్ద ప్రమాదం జరిగింది. ఆటో, లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో HYDకి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 15, 2026 / 03:08 PM IST

రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా

NTR: అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్ ఏసీపీ సత్యానందం హెచ్చరించారు. సత్యనారాయపురం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఆయన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి రౌడీ షీటర్ ప్రస్తుత జీవన శైలి గురించి అడిగి తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లరాదని హితవు పలికారు.

March 15, 2026 / 03:08 PM IST

డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ దొరికిపోయారు: కారుమూరి

AP: డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ దొరికిపోయారని మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ‘డ్రగ్స్ కేసులో ఎంపీ దొరకడం దేశచరిత్రలో ఇదే తొలిసారి. పోలీసులపై కాల్పులకు యత్నించడం సరైంది కాదు. పుట్టా మహేష్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలి. ఎంపీపై ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి. ఏపీ టీడీపీ నేతలంతా HYDకి వెళ్లి.. డ్రగ్స్ తీసుకుంటున్నారని తేటతెల్లమైంది’ అని పేర్కొన్నారు.

March 15, 2026 / 03:08 PM IST

‘కాశీ విశ్వేశ్వర స్వామి మూడో వార్షికోత్సవానికి పందిరిరాట’

E.G: కడియం మండలం మాధవరాయుడు పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శివపంచాయతన క్షేత్రాలయం 3వ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ పందిరిరాట ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ, విజయ దంపతులు పూజ కార్యక్రమం నిర్వహించి పందిరిరాట వేశారు. ఈ కార్యక్రమంలో అన్నందేవుల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

March 15, 2026 / 03:05 PM IST

వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న రైతులు

NRML: బాసరలోని పలు గ్రామాల్లో విద్యుత్ కేబుల్ వైర్ల వరుస దొంగతనాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఓని గ్రామ పరిధిలోని వ్యవసాయ బోర్ల వద్ద ఏడుగురు రైతులకు చెందిన కేబుల్ వైర్లను దుండగులు రాత్రికి రాత్రే కత్తిరించి ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలతో తీవ్రంగా నష్టపోతున్నామని, పొలాలకు నీరు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 15, 2026 / 03:03 PM IST