NLG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అమలు చేయబోమని తీర్మానం చేయాలని, రాష్ట్రంలోని కార్మికుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ నల్గొండ జిల్లా 13వ మహాసభల్లో ఈ డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.