BDK: పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా దర్శకుడు వేముగంటి రూపొందించిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది. బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మంగళవారం HYD ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు. తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ్లో చిత్రబృందాన్ని అభినందించారు.
JN: రైతు భరోసా పథకం దరఖాస్తుల విషయంలో రైతులు మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ హెచ్చరించారు. గ్రామ వ్యవసాయ అధికారులకు నేరుగా వివరాలు సమర్పించాలని, బ్యాంకు ఖాతా, ఆధార్, భూమి వివరాల్లో తప్పులు లేకుండా పూర్తి సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. రైతులందరికీ సమయానికి రైతు భరోసా లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
సూర్య నమస్కారం కృతజ్ఞతతో కూడిన 12 ఆసనాల సమాహారం. ఉదయం ఖాళీ కడుపుతో తూర్పు ముఖంగా చేస్తే రక్త ప్రసరణ, జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు. దీనితో పాటు 15 నిమిషాల ఉదయపు ఎండ వల్ల ఎముకలకు మేలు చేసే విటమిన్-డి అందుతుంది. ఇది రాత్రి పూట హాయిగా నిద్ర పట్టడానికి సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
SKLM: జిల్లా వ్యవసాయాధికారిగా వై.వెంకట మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డీడీగా పనిచేస్తున్నారు. గతంలో అమలాపురం, మచిలీపట్నం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
MHBD: మరిపెడ మండలంలోని గిరిపురం బీసీ అంగన్వాడీ సెంటర్లో బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు ఉడకని కోడిగుడ్డు పంపిణీ చేశారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గిరిపురం గ్రామ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే అదే నిర్లక్ష్యం కనిపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MHBD: మరిపెడ మండలంలోని గిరిపురం బీసీ అంగన్వాడీ సెంటర్లో బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు ఉడకని కోడిగుడ్లు పంపిణీ చేశారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గిరిపురం గ్రామ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే అదే నిర్లక్ష్యం కనిపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NRPT: మాగనూరు మండలంలో నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫామింగ్ కార్యక్రమం భాగంగా మంగళవారం రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో “రైతు నేస్తం” ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రసాయన రహిత పద్ధతుల్లో సాగు చేసే ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
VZM: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ఎరుబోతు సురేశ్ కుమార్ను జాల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. విధులకు వెళ్తున్న సమయంలో ఊటగెడ్డ వద్ద గాయపడిన గోపాల్ సింగ్ను గుర్తించి వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవడంతో అతని ప్రాణాలు నిలిచాయి.
KMR: రాందాస్ అగర్వాల్ జయంతిని పురస్కరించుకుని ఐవీఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో వైశ్య ఏక్తా దివాస్ మంగళవారం రాత్రి నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వైశ్యులను ఏకం చేయడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని నాయకులు కొనియాడారు. అనంతరం గోశాలలో గోవులకు పశుగ్రాసం పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. వైశ్యుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
GDWL: ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నా, వంటావార్పు నిర్వహించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు.
MBNR: ఉమ్మడి జిల్లాలో 74 కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 15 పాఠశాలలు. వీటిలో కొన్నింటిని ‘యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్’ శిక్షణ కోసం అధికారులు ఎంపిక చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా 20, వనపర్తి 14, జోగులాంబ గద్వాల జిల్లా 12, నారాయణపేట జిల్లాలో 13 పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్ ప్రవేశాల కోసం నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.
NLG: నకిరేకల్ సమీపంలోని జాతీయ రహదారి 65పై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ టైరు పగిలి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా నకిరేకల్ పోలీసులు క్లియర్ చేశారు.
ELR: నేర పరిశోధన, పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే లక్ష్యంతో, హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నత స్థాయి వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. నేర పరిశోధనలో AI సాంకేతికతలో పోలీస్ లెర్నింగ్ గురించి వివరించారు.
HYD: ఎల్బీనగర్, ఉప్పల్ జోన్ ప్రాంతాల వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. వనస్థలిపురం సచివాలయ నగర్లో స్విమ్మింగ్ పూల్ ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు. రూ. 500 పెడితే నెలరోజుల పాటు స్విమ్మింగ్ చేయొచ్చని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 10 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న అందరికీ ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ప్రత్యేకంగా మహిళలకు ఉంటుంది.
ప్రకాశం: కౌన్సిలర్లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారని మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఐదేళ్ల సేవలను స్మరించుకుంటూ వారిని సన్మానించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పేదల సంక్షేమం, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వంటి అంశాల్లో కౌన్సిలర్లు ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు.