MDK: స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
SDPT: వేములవాడ రాజరాజేశ్వర సామిని శనివారం జిల్లా జడ్జి ఇండోమెంట్స్ అడిషనల్ కమిషనర్ కే.జ్యోతి దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు స్వస్తి వేదోక్త స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ వినోద్ లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈవోలు బ్రహ్మన్న గారి శ్రీనివాస్, జీ.అశోక్ కుమార్లు, పర్యవేక్షకులు ఉన్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలో మిరియాల పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. ఇళ్ల ఆవరణలో టార్పాలిన్లపై ఎండబెడుతున్నారు. రెండు వారాలపాటు పంటను ఎండ బెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది మిరియాలు కేజీ రూ.600లకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ATP: గుంతకల్లులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉచిత పాలిసెట్ కోచింగ్ సెంటర్ను ఎంఈఓ మస్తాన్ రావు ప్రారంభించారు. ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు అందుబాటులో ఉచితంగా పాలీసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ADB: చత్తీస్గడ్లో ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో నాయకులతో సమావేశమై ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మందిని ఎన్ కౌంటర్ పేరిట హత్యలు చేస్తున్నారన్నారు. నిరసనగా ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
TG: హైదరాబాద్లోని బహీర్బాగ్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్రామ్ అని కొనియాడారు. జగ్జీవన్రామ్కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలున్నా..అప్పటి కాంగ్రెస్ పార్టీ అవకాశం రాకుండా చేసిందని తెలిపారు.
ATP: అనంతపురం నగరంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయం సామాజిక న్యాయ రంగాలలో గణనీయమైన పాత్ర పోషించారని ఆయన భావజాలం నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ దేవి పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్-1, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్-1, ఆప్టోమెట్రిస్ట్-1, ఫార్మసిస్ట్-1, డీఈవో-1, లాస్ట్ గ్రేట్ సర్వీస్-1 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
RR: బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి ఊపిరి పోయాలి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో దళిత విభాగం నాయకులు జాంగారి రవి, అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై నివాళులర్పించారు.
NTR: విజయవాడకు చెందిన 2 ఏళ్ల చిన్నారి క్యాన్సర్తో బాధపడుతూ HCG క్యాన్సర్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి పటాన్ చెరుకి “సింహ వాహిని ఫౌండేషన్” రూ. 37,050 సహాయం అందించింది.ఈ ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, సభ్యులతో కలిసి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ వీరికి తోడుగా నిలవాలని వంశీ రెడ్డి కోరారు.
HYD: రాజేంద్రనగర్లోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కార్మికుడిగా పనిచేస్తున్న యూసఫ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. బుద్వేల్ బస్తీలో ఉంటున్న యూసఫ్ కొన్నేళ్లుగా వెటర్నరీ కాలేజీలో లేబర్గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వచ్చిన అతడు కాలేజీ ఆవరణలో గేటుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD: GHMC పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ ఆదాయం మాత్రం కొంత పెరిగింది. క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది. హై రైజ్ భవనాలు సైతం క్రితం కంటే తగ్గాయి.
SKLM: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రణస్థలం సర్పంచ్ భానోజీ నాయుడు పేర్కొన్నారు. శనివారం ఉదయం రణస్థలం గ్రామంలోని కరిమజ్జి వీధిలో సర్పంచ్ నేతృత్వంలో పంచాయతీ అధికారులు సమక్షంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. వీధుల్లో కాలువలను శుభ్రం చేయించారు. తడి-పొడి చెత్తను వేరువేరుగా ఉంచి, పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల నేపథ్యంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ స్టేషన్కు రాకపోకలు సాగించే సుమారు 10 రైళ్ల గమ్యస్థానాలను ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ క్రమంలో స్టేషన్కు వచ్చే రైళ్లను చర్లపల్లి, కాచిగూడకు తరలించనున్నారు.
ATP: ధర్మవరంలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ శనివారం పరిశీలించారు. అనంతరం క్యాంటీన్లో ఉదయం కమిషనర్ టిఫిన్ చేశారు. క్యాంటీన్కు వచ్చిన వారిని టిఫిన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.