GDWL: ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నా, వంటావార్పు నిర్వహించారు. అనంతరం కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు.