BDK: పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ గ్రహీత దరిపల్లి రామయ్య జీవిత కథ ఆధారంగా దర్శకుడు వేముగంటి రూపొందించిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం గద్దర్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది. బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని మంగళవారం HYD ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు. తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ్లో చిత్రబృందాన్ని అభినందించారు.