KMR: రాందాస్ అగర్వాల్ జయంతిని పురస్కరించుకుని ఐవీఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో వైశ్య ఏక్తా దివాస్ మంగళవారం రాత్రి నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా వైశ్యులను ఏకం చేయడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని నాయకులు కొనియాడారు. అనంతరం గోశాలలో గోవులకు పశుగ్రాసం పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. వైశ్యుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.