• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటనపై కేసు నమోదు

VSP: లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్‌లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 12, 2025 / 07:02 AM IST

విశాఖ ఉక్కులు 16 మందికి ఛార్జిషీట్లు జారీ

విశాఖ ఉక్కుల పని చేస్తున్న 16 మంది అధికారులకు యాజమాన్యం ఛార్జిషీట్లు జారీ చేసింది. ఉక్కు కర్మాగారం అప్పుల్లో రూ.220 కోట్లు కలపకపోవడంతో ఛార్జిషీట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. వీరిలో కర్మగారంలోని ఆర్ఎండీ, క్యూఏటీడీ, ఎంఎం ఫైనాన్స్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. ఛార్జిషీట్లు అందుకున్న వారిలో కొందరు ఈ నెలాఖరులోన పదవీ విరమణ చేయనున్నారు.

February 12, 2025 / 07:01 AM IST

నేడు, రేపు మండలాల వారిగా ఎన్నికల శిక్షణ

SRD: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మండలాల వారిగా శిక్షణ కార్యక్రమాలను ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే శిక్షణ అధికారులను మండలాల వారిగా ప్రకటించినట్లు చెప్పారు. ఆర్వో ఏఆర్వోలుగా నియామకమైన ఉపాధ్యాయులు ఆయా మండలాల్లో శిక్షణకు హాజరుకావాలని సూచించారు.

February 12, 2025 / 06:59 AM IST

ఈనెల 25 వరకు మాత్రమే అవకాశం

Akp: ఈ నెల 25లోగా రైతులు తమ భూముల వివరాలను ఆన్ లైన్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని రోలుగుంట మండల వ్యవసాయాధికారి ఎస్.విజయలక్ష్మి తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకం, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్న ఆధార్ కార్డుతో సచివాలయం రైతు సేవా కేంద్రాలకు వెళితే రైతు సేవా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆన్ లైన్‌లో రిజిస్టర్ చేస్తారన్నారు.

February 12, 2025 / 06:33 AM IST

వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష

VSP: కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర బృందం డాక్టర్ పాదాలు, రమణ మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది, అధికారుల పని తీరు సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరును పరిశీలించి తగు సూచనలు చేశారు.

February 12, 2025 / 06:21 AM IST

రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు

VSP: సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.

February 12, 2025 / 06:19 AM IST

మార్చి 2న యుద్ధ భేరి

KMR: TSCPSEU రాష్ట్రశాఖ పిలుపు మేరకు కేంద్రప్రభుత్వం తెచ్చిన UPS విధానానికి వ్యతిరేకంగా మార్చి 2న HYD ధర్నాచౌక్‌లో నిర్వహించే యుద్ధభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి దీనికి సంబంధించిన గోడపత్రులను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెస్తున్న UPS విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

February 12, 2025 / 06:00 AM IST

అమెరికా, ట్రంప్‌పై పోప్ కీలక వ్యాఖ్యలు

తమ దేశంలో అక్రమ వలసదారులను వెనక్కి పంపేందుకు US ప్రభుత్వం చేపట్టిన భారీ బహిష్కరణ కార్యక్రమంపై పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వలసదారుల అణచివేతకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాదని పోప్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికా బిషప్‌లకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ట్రంప్ యంత్రాంగం ‘స్వాభావిక గౌరవాన్ని’ దెబ్బతీస్తుందని పోప్ విమర్శించారు.

February 12, 2025 / 05:20 AM IST

MHBD: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

MHBD:  గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామ సమీపంలోని నేషనల్ హైవేపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మహబూబాబాద్-నర్సంపేట నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో ఇండ్ల రమేశ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 12, 2025 / 05:03 AM IST

యువ మోర్చా కీలక పాత్ర పోషించాలి

NZB: ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ యువ మోర్చా కీలక పాత్ర పోషించాలని BJYM రాష్ట్ర అధ్యక్షుడు సెవేళ్ల మహేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మహేందర్ మాట్లాడారు. శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలు ఉండాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం బలమైన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు.

February 12, 2025 / 04:51 AM IST

‘సాయి మనోజ్ఞ అందరికీ ఆదర్శంగా నిలిచింది’

కృష్ణా: 2025 JEE మెయిన్ పేపర్-1లో 100% స్కోర్ చేసిన ఏకైక మహిళా అభ్యర్థిగా నిలిచిన గుత్తికొండ సాయి మనోజ్ఞకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఉజ్వల భవిష్యత్ కోసం కలలు కనే ప్రతీ విద్యార్థికీ మన రాష్ట్రానికి చెందిన సాయి మనోజ్ఞ ఆదర్శంగా నిలిచిందని సుజనా ప్రశంసించారు.

February 12, 2025 / 04:12 AM IST

CID మాజీ DGపై ఫిర్యాదు.. లక్ష్మీనారాయణ విచారణ పూర్తి

AP: సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై విచారణలో భాగంగా న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ స్టేట్‌మెంట్ పూరైంది. పీవీ సునీల్‌కుమార్‌పై లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీఐడీ విచారణ చేపట్టింది. వైసీపీ హయాంలో సీఐడీ అధికారి నరేంద్ర, జర్నలిస్ట్ అంకబాబు, ధరణికోట వెంకటేష్ అరెస్ట్ తీరును లక్ష్మీనారాయణ వివరించారు.

February 11, 2025 / 05:22 PM IST

OTTలోకి వచ్చేస్తున్న ‘భైరతి రణగల్’

కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘భైరతి రణగల్’. గతేడాదిలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా OTTలోకి రాబోతుంది. తెలుగు OTT వేదిక ‘ఆహా’లో ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక గీతా పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు నర్తన్ ఈ మూవీని తెరకెక్కించారు.

February 11, 2025 / 05:18 PM IST

రేపు పెనుకొండ మండలంలో మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: మంత్రి సవిత రేపు పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌లో జలహారతి కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సోమందేపల్లి మండలం మాగేచెరువు గ్రామంలో కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారి రథోత్సవంలో పాల్గొంటారని సిబ్బంది తెలిపారు.

February 11, 2025 / 05:17 PM IST

పార్టీ సీనియర్ నాయకులతో జగన్ సమావేశం

AP: వైసీపీ సీనియర్ నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇతర సీనియర్ నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

February 11, 2025 / 05:15 PM IST