• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వర్ధన్నపేటలో 100 పడకల ఆసుపత్రికి సన్నాహాలు

WGL:వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవ తీసుకున్నారు. నెంబర్‌కోల్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణానికి అనుకూలంగా సర్వే చేసి నివేదికలు సిద్ధం చేయాలని తహసీల్దార్‌‌కు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

December 18, 2025 / 07:21 PM IST

విద్యార్థులకు బస్సు సౌకర్యం

అనకాపల్లి మండలం మామిడిపాలెం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చొరవతో బస్సు సౌకర్యం కల్పించారు. ఈనెల 15వ తేదీన ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజాదర్బార్‌లో హైస్కూల్‌కు బడి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ప్లకార్డులతో హర్ష వ్యక్తం చేశారు.

December 18, 2025 / 07:21 PM IST

2029లో కూడా కాంగ్రెస్ దే అధికారం: సీఎం

HYD: 2029లో కూడా కాంగ్రెస్ దే అధికారం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 1/3 స్థానాలు గెలుస్తుంది.. 2/3 స్థానాలను గెలుచుకొని మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నాయకులు అహంకారం, అసూయ తగ్గించుకోవాలని సూచించారు. ఈ ఫలితాలతోనైనా వాళ్లకి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానన్నారు.

December 18, 2025 / 07:21 PM IST

‘విద్య‌తోనే ఉన్న‌త శిఖ‌రాల్ని అధిరోహించ‌వచ్చు’

కోనసీమ: విద్య‌తోనే ఉన్నత శిఖ‌రాల్ని అధిరోహించ‌వ్చ‌ని, విద్యార్థులు ఆదిశ‌గా క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని త‌ల్లితండ్రుల‌కు మంచి పేరును తీసుకురావాల‌ని ప్ర‌ముఖ సామాజిక సేవకురాలు, బండారు ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ బండారు శ్రీ‌దేవి అన్నారు. అల్ల‌వ‌రం మండ‌లం గోడి గురుకుల బాలుర పాఠ‌శాల‌లో ఐదో త‌ర‌గ‌...

December 18, 2025 / 07:20 PM IST

డబ్బులిస్తేనే లెప్రసీ సర్వే చేస్తాం: ఆశా కార్యకర్తలు

NZB: తమకు డబ్బులిస్తామంటేనే లెప్రసీ సర్వే చేస్తామని ఆశా కార్యకర్తలు అన్నారు. ఈ మేరకు డీఎంహెచ్వో కార్యాలయంలో ఏవోకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 18వ తేదీ నుంచి సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు సూచించిందన్నారు. కానీ అదనంగా ఇచ్చే రుసుముపై అధికారుల నుంచి స్పష్టత లేదన్నారు.

December 18, 2025 / 07:20 PM IST

జగన్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్

AP: జైలుకు పంపుతానన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు CM చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. PPP అనేది ప్రపంచంలోనే బెస్ట్ మోడల్ అని స్పష్టం చేశారు. విమర్శలకు తాను సమాధానం ఇవ్వగలనని.. కానీ దౌర్జన్యం, రౌడీయిజం చేస్తానంటే కుదరదని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తి తప్ప ప్రైవేట్‌ది కాదన్నారు. కొన్నేళ్లు వాళ్లు మెయింటేన్ చేసి మళ్లీ మనకే ఇస్తారని చెప్పారు.

December 18, 2025 / 07:17 PM IST

బంగ్లాదేశ్ జైల్లో మత్స్యకారులు.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్

VSP: అక్టోబర్‌ 20న బోటులో వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కు చిక్కి రెండు నెలలుగా బంగ్లాదేశ్ జైలులో ఉన్నారని, వారి విడుదలకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని నేత వాసుపల్లి జానకీరామ్‌ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ జైళ్ల నుంచి మత్స్యకారులను విడుదల చేయించారని గుర్తు చేశారు.

December 18, 2025 / 07:14 PM IST

కుష్టు వ్యాధి కేసుల గుర్తింపు సర్వే ప్రారంభం

HNK: తొలి దశలోనే కుష్టు వ్యాధిని గుర్తించి MDT చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యానికి గురికాకుండా కాపాడవచ్చని జిల్లా అడిషనల్ DMHO డా.మదన్మోహన్ రావు అన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దర్గాబస్తి దవాఖానలో గురువారం నుండి నిర్వహిస్తున్న కుష్టు వ్యాధి కేసుల గుర్తింపు సర్వే కార్యక్రమాన్ని WHO కన్సల్టెంట్ శిరీషతో కలిసి ఆయన ప్రారంభించారు.

December 18, 2025 / 07:13 PM IST

జాతీయ వాలీబాల్ పోటీలకు పూర్వ విద్యార్థిని ఎంపిక

NZB: ఆర్మూర్ మండలం మగ్గిడి పాఠశాల పూర్వ విద్యార్థిని నిషిత జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ మధు తెలిపారు. ప్రస్తుతం నిషిత వైజాగ్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందుతోందన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 21వరకు రాజస్థాన్‌లో జరుగుతున్న జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్‌కు ఎస్ఏఐ టీం తరఫున ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు.

December 18, 2025 / 07:10 PM IST

ఇంటర్‌ పాలిటెక్నిక్‌ క్రీడలకు ఏర్పాట్లు

VSP: రాష్ట్రస్థాయి ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ను కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంఛార్జ్ ప్రిన్సిపాల్‌ డా.కె. రత్నకుమార్ తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల పాలిటెక్నిక్‌ కళాశాలల నుంచి సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు.

December 18, 2025 / 07:09 PM IST

తిరుమలలో యువకులు హల్ చల్..!

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తమిళనాడు యువకులు రాజకీయ బ్యానర్ చేశారు. ఆలయం ముందు తమిళనాడు లోని జయ లలితా, పళని స్వామి ఫొటోలతో కూడిన బ్యానర్ గురువారం విడుదల చేసి వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు బ్యానర్ అలిపిరి తనిఖీలు దాటి తిరుమలకు ఎలా చేరాయి. భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

December 18, 2025 / 07:08 PM IST

జిల్లాల్లోని గ్రామాలకు 4జీ నెట్‌వర్క్

ATP: డిజిటల్ భారత్ నిధి కింద మొబైల్ నెట్‌వర్క్ లేని 120 గ్రామాలకు 4జీ సేవలు అందించేందుకు కేంద్రం రూ.120 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని నెట్‌వర్క్ లేని గ్రామాలకు ఏడాదిలోగా ఈ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా డిజిటల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.

December 18, 2025 / 07:08 PM IST

నూతన సర్పంచును సన్మానించిన TRP నేతలు

BHPL: మల్హరావు(M)తాడిచెర్ల గ్రామ నూతన సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండి స్వామిని టీఆర్‌పీ మల్హర్ రావు-తాడిచెర్ల అధ్యక్షుడు మేనం సంతోష్, పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. సంతోష్ మాట్లాడుతూ.. బండి స్వామి మంచి వ్యక్తి అని, గ్రామాభివృద్ధికి కీలకంగా పనిచేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజయ్య, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

December 18, 2025 / 07:07 PM IST

కొత్తవలస దుకాణంలో చోరీ

VAM: కొత్తవలస పట్టణ కేంద్రం కోటపాడు రోడ్డు జడ్పీ షాపింగ్ సముదాయంలో ఉన్న ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. వివరాల మేరకు దుకాణం యజమాని మరుసటి రోజు షాపు తెలిచి చూడగా కిటికీ ఊచలు వంచి లోనికి ప్రవేశించాడు. నగదు పెట్టె చూడగా రూ 35 వేలు నగదు చోరికి గురైనట్లు గుర్తించారు. తక్షణమే 100కు పిర్యాదు చేశారు.

December 18, 2025 / 07:06 PM IST

అంకితభావం చాటిన అధికార యంత్రాంగం!

KMR: జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎన్నికల విభాగాల సిబ్బంది కలెక్టర్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

December 18, 2025 / 07:06 PM IST