TG: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYDతో పాటు పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వానలు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
KMM: పెనుబల్లి మండలం తాళ్లపెంట సమీపంలో విద్యుత్తు తీగలతో అడవిపందిని వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులను తల్లాడ రేంజ్ అటవీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేశారు. వారి నుంచి 60 KGల మాంసం రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి ఉమ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారవ్వగా పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
SRD: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఆదిత్య (17) మియాపూర్లో నివసిస్తూ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మల్లంపేటలో బంధువుల ఇంటికి వచ్చి, స్నేహితులతో కలిసి కాజిపల్లి శివారులోని కంకర క్వారీలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NTR: నందిగామ మున్సిపాలిటీలో ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిస్థితి తారుమారైనా, అధికారం కోల్పోయిన, అధికార పార్టీ ప్రలోభాలకు లోనవ్వకుండా చివరి వరకు పార్టీకి అండగా నిలిచిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 30న ఏయూ కన్వెన్షన్ సెంటర్లో మాజీ ఉపకులపతుల సదస్సు నిర్వహించనున్నారు. “ఏయూ @100–పారంపర నుంచి ప్రపంచీకరణ దిశగా” అనే అంశంపై చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమ పోస్టర్ను వీసీ ఆచార్య జి.పీ.రాజశేఖర్ మంగళవారం ఆవిష్కరించారు. ఇందులో పలు మాజీ వీసీలు పాల్గొననున్నారు.
PDPL: సింగరేణి ఆర్జీ-1 ఏరియా పరిధిలోని ఆర్సీఓఏ క్లబ్లో ఈనెల 19న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో ఆయుర్వేద నిపుణులు విశ్వనాధ మహర్షి పాల్గొని బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉగాది పండుగ వేడుకలు నిర్వహిస్తున్నామని శాఖ అధిపతి మన్నెమోని కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని సూచించారు.
AP: తిరుపతి జిల్లా MLAలతో CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంఛార్జ్ మంత్రి అనగాని, కలెక్టర్, SP హాజరయ్యారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నాయకులు, అధికారుల పనితీరుపై వారు చర్చించారు. నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగా MLAలకు ర్యాంకులను సీల్డ్ కవర్లో అందించారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలని CBN ఆదేశించారు.
KNR: తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సహకార భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు. సహకార రంగ అభివృద్ధికి ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలన్నారు.
NLR: లింగసముద్రంలోని BC బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లను డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల జ్యోతి మంగళవారం తనిఖీ చేశారు. పాత ప్రభుత్వ భవనం దెబ్బతిన్న స్థితిలో ఉందని గుర్తించి కొత్త భవనం నిర్మించాలా అన్నదానిపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం హాస్టల్ను ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తూ విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు.
HNK: ఆత్మకూర్ మండలంలోని బాలల సంరక్ష సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చావత్ బాజ్ పాయ్ సందర్శించారు. శిశు గృహాలలోని సదుపాయాలు, బాలల సంరక్షణ, పోషణ, ఆరోగ్య పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. చిన్నారుల అభివృద్ధి కోసం అధికారులు పనిచేయాల్సిందిగా సూచించారు.
CTR: ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించి వడ్డీలో రాయితీ పొందవచ్చని తెలిపారు. ఈనెల 31వ తేదీ లోపు పన్ను బకాయిలు పూర్తిస్థాయిలో ఒకేసారి చెల్లించిన వారికి రాయితీ లభిస్తుందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కృష్ణా: బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామ ఇరిగేషన్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మంగళవారం కేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి సరఫరా గురించి అధికారులతో చర్చించారు. రైతులకు సమయానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలువల శుభ్రత, మరమ్మతులను వేగవంతంగా చేయాలని సూచించారు.
SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ గూడెం ఎల్లమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వడ్డె కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
TG: రాష్ట్ర విద్యా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇవాళ యూకే ప్రతినిధి బృందం పర్యటనలో భాగంగా HYDలో 13 అత్యాధునిక పాఠశాలల ఏర్పాటుపై స్పష్టత రానుంది. ఉన్నతాధికారులతో జరిగే ఈ భేటీలో పాఠశాలల నిర్వహణ, విద్యా ప్రమాణాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను భాగ్యనగర విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ బృందం రాక ప్రాధాన్యత సంతరించుకుంది.