AP: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాకాణికి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాది పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సోమవారం ప్రాసిక్యూషన్ వాదనల తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.
అన్నమయ్య: పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సీసీ ఎంతో ప్రసిద్ధి చెందిందని గ్రూప్ కెప్టెన్ ఆర్జే ఆత్రే కమాండింగ్ ఆఫీసర్ అన్నారు. శుక్రవారం అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్సీసీ వింగ్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉన్నత చదువులకు ఎన్సీసీ ధృవపత్రాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
BHPL: ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని, పెద్ద ఎత్తున లేబర్ను తీసుకురావాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం పలు మండల ప్రత్యేక అధికారులతో ఐడీవోసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
NLG: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం నెలకొందని, కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని, జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న సమీక్షలు లేవు, కొనుగోలు కేంద్రాలపై మాట్లాడడం లేదన్నారు.
MBNR: జిల్లా కేంద్రానికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం మంజూరు అయింది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఈ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అతి త్వరలో ఇది ప్రారంభంకానుంది. ఇందులో నాణ్యమైన మందులు తక్కువ ధరలకు లభించనున్నాయి. దీంతో పేద ప్రజలకు మందుల ఖర్చులు తగ్గనున్నాయి.
BPT: కర్లపాలెం మండలం ఎంవీ రాజుపాలెం గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను ఎంపీడీవో శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, అవసరాలు తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీనివల్ల గ్రామంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
NLG: చందంపేట మండలం పోలేపల్లి వద్ద బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుంటోజు వినోదాచారి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ మండల సమావేశం నిర్వహించారు. ఈనెల 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
KKD: రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించిన అమరావతి కళా వీధి ప్రదర్శనలో సీఎం నారా చంద్రబాబు స్వయంగా చిత్రీకరించిన బుద్ధుడి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్ర పటానికి ఉప సభాపతి కె. రఘు రామకృష్ణంరాజు రూ. 1,01,116లు చెల్లించి శుక్రవారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చిత్రీకరించిన బుద్ధుడిని తాను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
కోనసీమ: ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి ఎస్సైగా పదోన్నతి పొందారు. ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు మేరకు పదోన్నతి లభించడంతో కోనసీమ జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు… రమణారెడ్డిని రావులపాలెం అదనపు ఎస్సైగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రమణారెడ్డి రావులపాలెం అదనపు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు.
E.G: గండేపల్లి మండలం మురారి గ్రామంలో శుక్రవారం పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పాల్గొని రూ.1.5 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు, గ్రామస్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కోనసీమ: మామిడికుదురు పెరెళ్ల కాలువ గట్టు వద్ద ఉన్న రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది. అర్చకులు సుదర్శనం వెంకట శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామికి తమలపాకులు, గంధ సింధూరంతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.
ST సర్టిఫికెట్ జారీ విషయంలో కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అతడి తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తి అని అధికారులు తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించాడు. పేరెంట్స్లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో ST సర్టిఫికెట్ నిరాకరించడం సరికాదని.. వెంటనే ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
KNR: ఆరు సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తల్లిదండ్రులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు.
TG: ఖమ్మం జిల్లా బోదులబండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని సూచించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామని హెచ్చరించారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. శ్రీరామ నవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని స్పష్టం చేశారు.
TPT: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతి గ్రామీణ మండలం దుర్గ సముద్రంలో రైతులకు రాయితీపై పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రాయితీపై ఎరువులు, పనిముట్లు పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు.