• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శిల్పా శెట్టి ఇంట్లో ఐటీ రైడ్స్

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న బెంగళూరులోని ఆమె పబ్‌లో తనిఖీలు నిర్వహించారు. పబ్‌లో అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన రెస్టారెంట్‌లో అర్ధరాత్రి పార్టీలకు అనుమతిచ్చి రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రెస్టారెంట్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

December 18, 2025 / 09:13 PM IST

సీఎంను బొబ్బిలి వీణతో సత్కరించిన ఎంపీలు

AP: ఢిల్లీకి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైనందుకు విమానాశ్రయంలో పార్టీ ఎంపీలు చంద్రబాబును సన్మానించారు. సీఎంను టీడీపీ ఎంపీలు బొబ్బిలి వీణతో సత్కరించారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా విమానాశ్రయంలోనే సీఎం కేక్ కట్ చేయించారు.

December 18, 2025 / 09:05 PM IST

ఎమ్మెల్య గిత్త జయసూర్య రేపటి పర్యటన వివరాలు

NDL: నంది కొట్కూరు MPDO కార్యాలయం నందు రేపు గ్రీవెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్య జయసూర్య ఉ. 10.30 గం.లకు హాజరై, ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరించనున్నారు. ఈ మేరకు కార్యాలయం సమాచార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ తెలిపారు. కావున సంబందిత అధికారులు, పాల్గొనాలని పిలుపునిచ్చారు.

December 18, 2025 / 09:02 PM IST

గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS 57 స్థానాలు కైవసం

భువనగిరి నియోజకవర్గంలో జరిగిన 126 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో BRS తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 57 స్థానాల్లో విజయం సాధించగా, అధికార కాంగ్రెస్ 56 స్థానాలు సాధించి సరిపెట్టుకుంది. బీజేపీ 1, స్వతంత్రులు 12 స్థానాలు గెలుచుకున్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఇలాకాలో BRS మెజారిటీ స్థానాలు సాధించడం రాజకీయంగా ప్రాధాన్యత పొందింది.

December 18, 2025 / 08:58 PM IST

‘నగరంలో చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి’

NZB: నగరంలో చెత్త సేకరణ ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త పారేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం పర్యటించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలన్నారు.

December 18, 2025 / 08:58 PM IST

కేఎంసీ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ట్రాన్స్ జెండర్లు

KMM: కేఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడిన ట్రాన్స్ జెండర్‌లకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున పదిమందికి రూ. 10 లక్షలు రుణాలు అందించారు. ఈ మేరకు గురువారం కమిషనర్ అభిషేక్ అగస్త్య‌ను ట్రాన్స్ జెండర్లు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

December 18, 2025 / 08:58 PM IST

చౌడేపల్లి మండలంలో వ్యక్తి ఆత్మహత్య

అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం నేతిగుట్లపల్లెకు చెందిన రవి (55) కుటుంబ సమస్యల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. గురువారం పురుగు మందు తాగిన రవిని కుటుంబీకులు గమనించి చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్సలు అందిస్తుండగానే అతను మృతి చెందినట్లు తెలిపారు.

December 18, 2025 / 08:58 PM IST

వచ్చే ఆదివారం నుండి పాఠశాలల్లో హ్యాపీ సండే

కోనసీమ: వచ్చే ఆదివారం నుంచి మండపేటలోని మునిసిపల్ పాఠశాలల్లో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండపేట పురపాలక సంఘం కమిషనర్ టీవీ రంగారావు పేర్కొన్నారు. మండపేట మునిసిపల్ ఉపాధ్యాయుల సమావేశం గురువారం సాయంత్రం మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మండపేట పురపాలక సంఘ పరిధిలో గల పురపాలక సంఘ పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు.

December 18, 2025 / 08:57 PM IST

రాజీ మార్గమే రాజమార్గం: ఎస్పీ

WNP: వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి. ఒకవేళ ఇంతటితో కలిసి ఉంటామని ఒక నిర్ణయానికి వస్తే అప్పుడే సమస్యలు, వివాదాలు సమసిపోతాయని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. ఉచిత న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 వ తేదీన జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ రాజీ పడ దగిన కేసులను కక్షిదారులు ఉపయోగించుకోవాలని అన్నారు.

December 18, 2025 / 08:57 PM IST

గ్రీవెన్స్ కార్యక్రమం ఈనెల 22వ తేదీకి వాయిదా

కృష్ణా: ఈనెల 19న శుక్రవారం నిర్వహించాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల దృష్ట్యా ఈనెల 22కి వాయిదా వేసినట్లు కలెక్టర్ డీ.కే. బాలాజీ గురువారం తెలిపారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఈ మార్పును గమనించి, 22వ తేదీన జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ బాలాజీ కోరారు.

December 18, 2025 / 08:56 PM IST

తెలంగాణలో విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్థానం

HYD: దోమలగూడలో నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశంలో ఏఏపీ తెలంగాణలో తన ప్రస్థానాన్ని వేగవంతం చేస్తోందని నేతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 20 వేల మందికిపైగా సభ్యత్వాలు నమోదు కాగా, వివిధ జిల్లాల్లో భారీ చేరికలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగుతూ, ఏఏపీ ప్రజలకు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది.

December 18, 2025 / 08:55 PM IST

రేపు తల్లాడలో మాజీ ఎమ్మెల్యే పర్యటన

KMM: తల్లాడ మండలంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, మండల అధ్యక్షులు వీర మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను అభినందించేందుకు ఒక సభ ఏర్పాటు చేయబడిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

December 18, 2025 / 08:55 PM IST

వాహనాల తనిఖీల్లో రూ. 4.62,500 పెట్టివేత

NRPT: పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీల్లో రూ.4,62,500 నగదును పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం తెలిపారు. అలాగే రూ.4,11,685 విలువైన 730 లీటర్ల మద్యం, రూ.11,40,003 విలువైన చీరలు, విలువైన వస్తువులు, రేషన్ బియ్యం, ఎలక్ట్రానిక్ వస్తువులు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

December 18, 2025 / 08:54 PM IST

పోర్టును సందర్శించిన అమెరికా కాన్సులేట్ జనరల్

VSP: యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్, హైదరాబాద్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ గురువారం విశాఖ పోర్ట్ అథారిటీను సందర్శించారు. పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్ దుర్గేష్ కుమార్ దూబే సహా సీనియర్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. పోర్టులోని ఆధునిక మౌలిక వసతులు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునికీకరణ–యాంత్రీకరణ పనులను వివరించారు.

December 18, 2025 / 08:51 PM IST

మదనపల్లి మండలంలో దంపతులపై దాడి

అన్నమయ్య: మదనపల్లి మండలం కొండామారిపల్లి బెస్తపల్లిలో గురువారం సాయంత్రం చెత్త వేయడం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా పురుషోత్తం, అలివేలు దంపతులపై అదే వీధిలో నివసించే మురళి, లీలావతి దంపతులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన పురుషోత్తం, అలివేలులను కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

December 18, 2025 / 08:51 PM IST