VZM: వేపాడ మండలం కుమ్మపల్లిలో గురువారం వెటర్నరీ డాక్టర్ గాయత్రి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో 7 పశువులకు గర్భాధారణ ఇంజక్షన్లు, 22 పశువులకు గర్భకోశ, సాధారణ చికిత్సలు నిర్వహించారు. శీతాకాలంలో పశువులు, జీవాల యాజమాన్యాలపై పాడి రైతులకు అవగాహన కల్పించారు.
SRCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు ఈ నెల 22న గెలిచిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. చందుర్తి మండలంలోని ఆశి రెడ్డి పల్లి పంచాయతీ, పంచాయతీ భవనానికి మరమ్మతు పనులు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో భవనాలకు రంగులు వేస్తున్నారు. ఫర్నిచర్ను సమకూర్చుతున్నారు.
ELR: సమగ్ర కుటుంబ సర్వే మండలంలో చురుగ్గా జరుగుతుందని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ తెలిపారు. గురువారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ.. మండలంలో 27 గ్రామాల్లో సర్వే టీం ఇంటింటికి వెళ్లి అన్ని వివరాలు సేకరిస్తున్నారన్నారు. సేకరించిన వివరాలను యాప్ లో డౌన్లోడ్ చేస్తున్నారన్నారు. పలు గ్రామాల్లో సర్వేను పరిశీలించానన్నారు.
VZM: తోటపాలెం గాంధీ విగ్రహం వద్ద ఇవాళ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును వీ .బీ.జీ రామ్-జీ పేరుగా మార్చడం ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ద్వజమెత్తారు. ఈ నిరసనలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. నందమూరి బాలకృష్ణ చేసే అన్స్టాపబుల్ షో తరహాలో మరో అదిరిపోయే షోతో సిద్ధూ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో ఓ ప్రముఖ OTT సంస్థ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. 2026 సంక్రాంతి కానుకగా ఈ షో ప్రారంభం కానుందట. సిద్ధూ హోస్ట్గా వ్యవహరించనున్న ఈ షో తెలంగాణ యాస ఒట్టి పడేలా ఉండనున్నట్లు టాక్.
AP: స్కాములు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ‘ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు.. వారికి జీతాలు ప్రభుత్వం ఇస్తుందట. ఒక్కొక్క కాలేజీకి రూ.120 కోట్లు ఇస్తున్నారు. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉంటుందా? వైసీపీ అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు తీసుకున్నవాళ్లను జైల్లో పెడతాం’ అంటూ హెచ్చరించారు.
టీవీకే అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఈరోడ్ సభలో ఆయన మాట్లాడారు. ఉచిత పథకాలకు తాను వ్యతిరేకం కాదని, ఉచిత పథకాలను తానెప్పుడూ విమర్శించలేదని పేర్కొన్నారు. ఉచిత పథకాల పేరుతో ప్రజలను అవమాస్తున్నారని, ప్రజలకు కనీస వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా ఎందుకు ఉచిత పథకాలుగా మారుస్తున్నారని ప్రశ్నించారు.
MLG: జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పై మంత్రి సీతక్క, DCC అధ్యక్షుడు అశోక్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చాంద్ పాషా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు ED కేసులు పెట్టి బెదిరిస్తోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. BJP ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
ATP: గుత్తిలోని అంబేద్కర్ కాలనీలో రోడ్డుపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీవాసులు గురువారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. కాలనీవాసులు కృష్ణ గోపాల్, మస్తానమ్మ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయాకు వినతిపత్రం అందజేశారు.
AKP: ప్రభుత్వ నిరంకుశ, విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం అనకాపల్లి డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. ఉపాధ్యాయులను బోధ నేతర పనుల నుంచి మినహాయించాలన్నారు.
AP: గత వైసీపీ విధానాల వల్లే RTC బతికిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నాయి. చంద్రబాబు తన అసమర్థతను కలెక్టర్ల మీద రుద్దుతున్నారు. మెడికల్ కాలేజీలతో టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. కోటి 4 లక్షల మందికిపైగా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు’ అని వెల్లడించారు.
VZM: భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రేపు జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం 4.45 వీటీ.అగ్రహరంలోని వై జంక్షను దగ్గర గల సీఎంఆర్ లే ఆవుట్ చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గోంటారు. అనంతరం సాయంత్రం 6గంటలకు బయలుదేరి రాత్రి 7.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు.
JN: బొమ్మకూరు రిజర్వాయర్లో సుమారు ప్రభుత్వం నుంచి వచ్చిన 2,70,000 వేల చేప పిల్లలను ఈరోజు బొమ్మకూర్ రిజర్వాయర్లో వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో మత్సకారుల పారిశ్రామిక సంఘం సొసైటీ వైస్ ఛైర్మెన్ ఇట్టబోయిన సమ్మయ్య , కార్యదర్శి పండుగ రమేశ్, నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్కు ముప్పు అని పేర్కొన్నారు. ఆ దేశంలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొన్నాయని ఆరోపించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజాస్వామ్యంగా అణగదొక్కేలా ప్రస్తుత ప్రభుత్వం విధానాలను అనుసరిస్తోందన్నారు.
BHPL: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి కుష్టు వ్యాధిని గుర్తించే ఎల్సీడీసీ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు ఈ సర్వే కొనసాగుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డా. మౌనిక తెలిపారు. ప్రతి ఆశా వర్కర్ ఇంటింటికి వెళ్లి రోజుకు 20 కుటుంబాల వివరాలు సేకరిస్తారని, వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ఔషధాలు అందిస్తారని పేర్కొన్నారు.