KRNL: పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల త్వరిత పరిష్కారానికి బుధవారం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాల్లో పరిష్కారం కాని సమస్యలను నేరుగా సీఎండీకి వినిపించవచ్చని పేర్కొన్నారు.