• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాబూ జగ్జీవన్ రామ్‌కు జేసీ, ఎమ్మెల్యేలు ఘన నివాళి

KRNL: భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని శనివారం కర్నూలులోని 5 రోడ్ల కూడలి, RS రోడ్డు వద్ద JC డాక్టర్ B.నవ్య, రాజకీయ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని నేతలు కొనియాడారు. కార్యక్రమంలో కోడుమూరు, పాణ్యం MLAలు పాల్గొన్నారు.

April 5, 2025 / 02:40 PM IST

భద్రాచలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వెళ్లే భక్తులకు APSRTC శుభవార్త చెప్పింది. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించింది. రాజమండ్రి నుంచి  భద్రాచలానికి 8 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గంటకు ఒక బస్సు చొప్పున నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

April 5, 2025 / 02:28 PM IST

మయన్మార్‌కు క్వాడ్ దేశాల ఆర్ధిక సాయం

ఇటీవల భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌ను ఆదుకోవడానికి క్వాడ్ దేశాలు ముందుకొచ్చాయి. మయన్మార్‌లోని సంక్షోభ పరిస్థితులపై భారత్, US, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ 20 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. కాగా, గత నెల 28న థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూకంపం వల్ల 3 వేలకుపైగా మరణించారు.

April 5, 2025 / 02:24 PM IST

బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎస్పీ

MDK: స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

April 5, 2025 / 02:17 PM IST

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి

SDPT: వేములవాడ రాజరాజేశ్వర సామిని శనివారం జిల్లా జడ్జి ఇండోమెంట్స్ అడిషనల్ కమిషనర్ కే.జ్యోతి దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు స్వస్తి వేదోక్త స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ వినోద్ లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈవోలు బ్రహ్మన్న గారి  శ్రీనివాస్, జీ.అశోక్ కుమార్‌లు, పర్యవేక్షకులు ఉన్నారు.

April 5, 2025 / 02:04 PM IST

ఆశాజనకంగా మిరియాల సాగు

ASR: డుంబ్రిగూడ మండలంలో మిరియాల పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. ఇళ్ల ఆవరణలో టార్పాలిన్లపై ఎండబెడుతున్నారు. రెండు వారాలపాటు పంటను ఎండ బెట్టి విక్రయాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది మిరియాలు కేజీ రూ.600లకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

April 5, 2025 / 01:17 PM IST

ABVP ఆధ్వర్యంలో ఉచిత పాలిసెట్ కోచింగ్

ATP: గుంతకల్లులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉచిత పాలిసెట్ కోచింగ్ సెంటర్‌ను ఎంఈఓ మస్తాన్ రావు ప్రారంభించారు. ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు అందుబాటులో ఉచితంగా పాలీసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

April 5, 2025 / 01:02 PM IST

‘ఆపరేషన్ కాగార్‌ను వెంటనే నిలిపివేయాలి’

ADB: చత్తీస్‌గడ్‌లో ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలో నాయకులతో సమావేశమై ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మందిని ఎన్ కౌంటర్ పేరిట హత్యలు చేస్తున్నారన్నారు. నిరసనగా ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

April 5, 2025 / 12:42 PM IST

జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్‌లోని బహీర్‌బాగ్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహానికి  పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. జగ్జీవన్‌రామ్‌కు ప్రధాని అయ్యే అన్ని అర్హతలున్నా..అప్పటి కాంగ్రెస్ పార్టీ అవకాశం రాకుండా చేసిందని తెలిపారు.

April 5, 2025 / 11:15 AM IST

బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన ఆర్థిక శాఖ మంత్రి

ATP: అనంతపురం నగరంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయం సామాజిక న్యాయ రంగాలలో గణనీయమైన పాత్ర పోషించారని ఆయన భావజాలం నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

April 5, 2025 / 11:05 AM IST

విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ దేవి పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్-1, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్-1, ఆప్టోమెట్రిస్ట్-1, ఫార్మసిస్ట్-1, డీఈవో-1, లాస్ట్ గ్రేట్ సర్వీస్-1 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

April 5, 2025 / 11:03 AM IST

‘మహనీయులను స్ఫూర్తిగా తీసుకొవాలి’

RR: బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి ఊపిరి పోయాలి అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో దళిత విభాగం నాయకులు జాంగారి రవి, అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై నివాళులర్పించారు.

April 5, 2025 / 10:51 AM IST

‘చిన్నారి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సహాయం అందజేత’

NTR: విజయవాడకు చెందిన 2 ఏళ్ల చిన్నారి క్యాన్సర్‌తో బాధపడుతూ HCG క్యాన్సర్ సెంటర్‌లో చికిత్స పొందుతోంది. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి పటాన్ చెరుకి “సింహ వాహిని ఫౌండేషన్” రూ. 37,050 సహాయం అందించింది.ఈ ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, సభ్యులతో కలిసి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ వీరికి తోడుగా నిలవాలని వంశీ రెడ్డి కోరారు.

April 5, 2025 / 10:28 AM IST

రాజేంద్రనగర్‌ వెటర్నరీ కాలేజీలో కార్మికుడి మృతి

HYD: రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కార్మికుడిగా పనిచేస్తున్న యూసఫ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. బుద్వేల్ బస్తీలో ఉంటున్న యూసఫ్ కొన్నేళ్లుగా వెటర్నరీ కాలేజీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వచ్చిన అతడు కాలేజీ ఆవరణలో గేటుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

April 5, 2025 / 10:10 AM IST

GHMCలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు

HYD: GHMC పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ ఆదాయం మాత్రం కొంత పెరిగింది. క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది. హై రైజ్ భవనాలు సైతం క్రితం కంటే తగ్గాయి.

April 5, 2025 / 10:06 AM IST