నల్గొండ జిల్లా డిండి మండలం ప్రతాప్ నగర్కు చెందిన ఆలేటి రామస్వామి కటిక పేదరికాన్ని జయించి ఐబీపీఎస్ క్లర్క్గా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలైనప్పటికీ 23 ఏళ్ల వయసులోనే పట్టుదలతో చదివి ఈ విజయం సాధించారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని లక్ష్యాన్ని ముద్దాడిన రామస్వామి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.