SRPT: చిలుకూరు మండలం ఆచార్యులగూడెం కోదండ రామాలయ కమిటీలు కుల వివక్ష జరుగుతుందని ఫిర్యాదుతో తహసీల్దార్ ధ్రువ కుమార్ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ సమయంలో వాగ్వాదం జరగడంతో ఈనెల 24 తేదికి వాయిదా వేశారు. న్యాయం జరగకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.