TPT: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతి గ్రామీణ మండలం దుర్గ సముద్రంలో రైతులకు రాయితీపై పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రాయితీపై ఎరువులు, పనిముట్లు పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు.
AP: లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్ సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కేసులో సాక్షిగా హాజరుకావాలని ఇటీవల కసిరెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వగా.. వీటిని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. కసిరెడ్డికి మరోసారి నోటీసులు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
KDP: హైదరాబాదులో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయనను జిల్లా జెడ్పీ ఛైర్మన్ ముత్యాల రామ గోవిందు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కడప జెడ్పీ ఛైర్మన్గా సహాయ సహకారాలు అందించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంపీ అవినాష్ను శాలువ, పూలమాలతో సత్కరించారు. ఈయన వెంట సంబుటూరు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
KDP: ముద్దనూరు మండల కేంద్రంలో ఎర్రగుంట్ల పోయే రోడ్డు పక్కన వైసీపీ నూతన కార్యాలయం ఏర్పాటుకు జమ్మలమడుగు మాజీ MLA డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు, ఎర్రగుంట్ల మండల వైసీపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జయరాంరెడ్డి, సన్నీ, మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ మచ్చు వారి పల్లెకు చెందిన వైసీపీ నేత రెడ్డి రాజులు ఆకస్మిక మరణం చెందారు. ఆ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి నిస్సార్ అహ్మద్ ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రెడ్డి రాజుల మృతి పార్టీకి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు.
PDPL: రామగుండం కమిషనరేట్ షీటీం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ సహా ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. సమాజంలో మహిళల భద్రత, హక్కులపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 1091 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అవోపా వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అవోపా ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల సౌకర్యార్థం ఈ ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చలివేంద్రం మొదటి రోజు మజ్జిగను పంపిణీ చేశారు. ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూజలు చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
PDPL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.గత నెల 15వ తేదీ నుంచి పెద్దపల్లి జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో 3,4, 5 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందిస్తున్నామని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంపన్నులతో సమానంగా భోజనం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని వెల్లడించారు.
అన్నమయ్య: వాల్మీకిపురం పట్టణంలో శుక్రవారం మాజీ సైనికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. వాయల్పాడు, మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రవి, కంచర్ల శ్రీ నాయుడు మాట్లాడుతూ.. మాజీ సైనికుడి కుమారుడు వెంకటాద్రిపై వేధింపులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
HNK: జిల్లా కేంద్రంలోని ఏకశిలా పార్కు ఎదుట నేడు వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు దీక్ష శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ప్రారంభించారు. అకాల వర్షాలు అనావృష్టి సమస్యల నుంచి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులు దీక్షలో కూర్చున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చిర్రా నర్సింగ్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి చాంద్ పాషా పాల్గొన్నారు.
KMM: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోదులబండలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. క్వింటాకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.
పెద్దపల్లి: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని బస్టాండ్కు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ ఐటీఐ పెద్దపల్లి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని శుక్రవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, పాల్గొన్నారు.
TG: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్తో ఆయన సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉన్నతాధికారులతో, సాయంత్రం 6:30 గంటలకు అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ఆయన సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు.
BPT: బాపట్ల జిల్లా కొల్లూరులో విద్యుత్ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించారు.