• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గాలి కుంటు వ్యాధి నివారణ టీకా

SKLM: సరుబుజ్జిలి తెలికి పెంట పంచాయతీలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ గోవిందరావు ఇవాళ ప్రారంభించారు. పశుసంవర్ధక రంగం రైతులకు అదనపు ఆదాయం అందించే ముఖ్యమైన వనరు అని అన్నారు. పశువులను వ్యాధుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న టీకా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 18, 2026 / 10:18 AM IST

వాహనాలకు రెడ్ సిగ్నల్ పడితే చిరుజల్లులు

AP: వేసవి ఎండల నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు అనంతపురంలోని సప్తగిరి కూడలిలో ‘ఓపెన్ స్పేస్ కూలింగ్ సిస్టం’ ఏర్పాటు చేశారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు నీటి తుంపరల ద్వారా ఈ వ్యవస్థ చల్లదనాన్ని అందిస్తుంది. టీచర్ సురేష్ నాయక్ సూచనతో మున్సిపల్ అధికారులు రాష్ట్రంలోనే తొలిసారిగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ట్రయల్ రన్ కొనసాగుతోంది.

March 18, 2026 / 10:18 AM IST

రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా కొలనూరు వాసి

SRCL: కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల దశరథం రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా నియమకమయ్యారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పీఆర్‌వోగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న I&PR AD దశరథంను లోక్ భవన్‌లో గవర్నర్‌కు ప్రెస్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు సమాచార, ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు.

March 18, 2026 / 10:17 AM IST

క్షమాపణలు చెప్పిన పార్తిబన్‌

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ఈవెంట్‌లో తన స్పీచ్‌పై నటుడు పార్తీబన్ క్షమాపణలు చెప్పాడు. వేదికపై కులం పేరు ప్రస్తావించడంపై స్పందిస్తూ.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, అది కేవలం నోరు జారడం వల్ల జరిగిందని వివరించాడు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు చేసిన తాను ఇలా చేయడం తన ఇన్నేళ్ల అనుభవంలో ఇదే మొదటిసారని, ఇకపై జాగ్రత్తగా ఉంటానని తెలిపాడు.

March 18, 2026 / 10:17 AM IST

అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు అండ

KRNL: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బూత్ యూనిట్ ఇన్‌ఛార్జ్ తలారి అంజీ స్పష్టం చేశారు. బుధవారం పెద్దకడబూరులోని బీసీ కాలనీలో రైతన్న కోసం కార్యక్రమం నిర్వహించారు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు ఏడాదికి రూ. 20,000 జమ చేయడం జరిగిందన్నారు.

March 18, 2026 / 10:17 AM IST

ప్రేమ వివాదం.. యువకుడు సూసైడ్..!

అన్నమయ్య: రాజంపేట మండలం DBNకి చెందిన యువకుడు ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన వివాదంతో మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామానికి చెందిన యువతితో ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న అతను ఆమె మరో యువకుడితో చనువుగా ఉందని ప్రశ్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు అనిల్‌పై దాడి చేయగా.. అతను ఆత్మహత్యకు యత్నించినట్లు పేర్కొన్నారు.

March 18, 2026 / 10:17 AM IST

చెత్త విభజనపై అవగాహన కల్పించిన చైర్‌పర్సన్

SDPT: హుస్నాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 3 వ వార్డు లో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి – కొమురయ్య ఆధ్వర్యంలో చెత్త విభజనపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా పరిసరాల పరిశుభ్రతను కాపాడవచ్చన్నారు. తడి చెత్తతో కంపోస్ట్ ఎరువు, పొడి చెత్తతో పునర్వినియోగ వస్తువులు తయారు చేయవచ్చని అవగాహన కల్పించారు.

March 18, 2026 / 10:16 AM IST

ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ

ASF: దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన భవాని అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు SI విక్రం తెలిపారు. స్వగ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చిన ఆమె, 2 రోజుల క్రితం కాగజ్ నగర్ నుంచి బల్లార్షాకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం తెలిసిన వారు 8712670537ను సంప్రదించాలన్నారు.

March 18, 2026 / 10:16 AM IST

జిల్లాలో KGVB విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

JN: జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGVB) ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు GCDO గౌసియా బేగం తెలిపారు. పదవ తరగతి పరీక్షలు రాసిన బాలికలు ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత గల బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గౌసియా బేగం సూచించారు.

March 18, 2026 / 10:15 AM IST

పారిశ్రామిక, టూరిజం అభివృద్ధికి చర్యలు

PLD: దాచేపల్లి మండలంలో పారిశ్రామిక, టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  దాచేపల్లి మండలంలోని పొందుగల గ్రామంలో విస్తృతంగా పర్యటించి కృష్ణా నది గాట్లు, పరిశ్రమలకు అవసరమైన భూములను పరిశీలించారు.

March 18, 2026 / 10:15 AM IST

భూ సమస్యలపై పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

ELR: కైకలూరు నియోజకవర్గంలో 22(ఏ) భూ సమస్యలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రి‌సెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు తెలిపారు. జిల్లాలో 22 (ఏ) భూ సమస్యల పరిష్కారాలపై మంగళవారం భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

March 18, 2026 / 10:15 AM IST

‘రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి’

ASR: నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వ్యవసాయ సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ప్రతినిధులు ఎస్.వరలక్ష్మి, అంజలి తెలిపారు. మంగళవారం కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం, పనసలపాడు గ్రామాల్లో ‘రైతన్న మీకోసం’ నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని రైతులతో సమావేశమయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు.

March 18, 2026 / 10:15 AM IST

వేం నరేందర్ ను అభినందించిన మల్లికార్జున ఖర్గే

MHBD: తెలంగాణ నుంచి ఇటీవల వేం. నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో వేం. నరేందర్ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వేం నరేందర్‌ని ఖర్గే అభినందించారు. ఎంపీలు మల్లు రవి, బలరాంనాయక్, సురేష్, తదితరులున్నారు.

March 18, 2026 / 10:14 AM IST

‘ఓపెన్ జిమ్ మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం’

NRML: నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో మార్నింగ్ వాక్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్  చక్రవర్తి బుధవారం వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. వాకింగ్ చేసే వారికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, ఓపెన్ జిమ్ మెరుగుదల, సాయంత్రం లైటింగ్ సదుపాయాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

March 18, 2026 / 10:13 AM IST

నేడే మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్..!

KDP: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కడపలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు జరగనుంది. కాగా, ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం గురువులు పాల్గొంటారన్నారు.

March 18, 2026 / 10:12 AM IST