ELR: కోకో రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గురువారం జిల్లా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తీసుకువెళ్లింది. అమరావతి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోకో గింజలు కొనుగోలు, ధరల సమస్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు అచ్చెన్నాయుడికి వినతిపత్రం అందజేశారు.
PDPL: గోదావరిఖని మారుతి నగర్కు చెందిన చుక్క సత్తమ్మ (65) గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సదాశయ ఫౌండేషన్ ద్వారా నేత్రదానం చేశారు. LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ మృతురాలి కార్నియా సేకరించి HYD-ఐ బ్యాంకుకు తరలించారు. కుటుంబ సభ్యులు రాజేశ్వరరావు, పద్మ, రవి కుమార్, ప్రణీత, కృపాకర్, ప్రశాంత్, సుష్మ, తదితరులు పాల్గొన్నారు.
ELR: సీడ్, ఫీడ్ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న ఆక్వా రైతులపై మరో పిడుగు పడింది. భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 26% పన్నులు విధిస్తామని చెప్పడం ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా నుంచి అమెరికా ఇతర దేశాలకు రొయ్యలు ఎగుమతి అవుతాయి. ఇదే అదునుగా ఎగుమతిదారులు కౌంట్ను బట్టి రూ.20 నుంచి రూ.30 తగ్గించారని రైతులు లబోదిబోమంటున్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది.పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు.
PLD: వినుకొండలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి మానవ సేవా సమితి సభ్యులు అంతక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనాధ శవానికి అంతక్రియలు చేసేందుకు మాజీ కౌన్సిలర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మానవ సేవా సమితి అధ్యక్షుడు పీవీ సురేశ్ బాబు ఆధ్వర్యంలో హెల్పింగ్ హార్డ్ సంస్థ సభ్యులు ముందుకొచారు.
ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీకొనడంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు స్థానిక టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు మహిళా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని మంత్రి ప్రారంభిస్తారు. అదే విధంగా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
GNTR: అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
TG: కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ‘కులగణన, OBC రిజర్వేషన్లు.. రాజ్యాంగ పరిరక్షణలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేసి.. బిల్లుపై గవర్నర్తో సంతకం చేయించకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు.
బాపట్ల: నాటుసారా తయారీలో ఉపయోగించే నల్లబెల్లం విక్రయాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చీరాల ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు బెల్లం వ్యాపారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన తన ఆఫీస్లో బెల్లం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీ నివారణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బెల్లం వ్యాపారులపై కూడా నిఘా ఉంటుందని సీఐ వారికి స్పష్టం చేశారు.
GNTR: తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో జాతీయ రహదారికి సమీపంలో వాహన దారులను ఇబ్బంది పెడుతున్న ఓ ట్రాంజెండర్కు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు హెచ్చరిక జారీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ట్రాన్సజెండర్కు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఎవరైనా ట్రాన్సజెండర్స్ అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని వెల్లడించారు.
BPT: వేసవి సెలవుల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరుగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ తుషార్ గురువారం సూచించారు. విహార యాత్రలకు వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని తెలిపారు. పోలీసులకు సమాచారం అందిస్తే నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కోనసీమ: ఆస్తి పన్ను వసూళ్లులో మండపేట పురపాలక సంఘం కోనసీమ జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో పదవ స్థానం సాధించిందని మున్సిపల్ ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి తెలిపారు. పన్ను వసూళ్లు చేయడంలో మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు చేసిన కృషిని అభినందించారు. గురువారం ఆమె ఛాంబర్లో ఆయన్ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వాలు నడవాలంటే పన్నులు వసూలు కీలకమన్నారు.
ELR: ఉంగుటూరు రూ.44 లక్షల 80 వేల నిధులతో సమ్మర్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్పంచ్లతో వేసవిలో తాగునీరు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ కోరారు.
VZM: కొత్తవలస పట్టణ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో 7, 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెడు వ్యసనాల, వాటి అనర్ధాలపై పట్టణ సీఐ ఎస్. షణ్ముఖరావు విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీతత్వంలో విద్యార్థులు కష్టపడి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు.