• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆక్రమణల తొలగింపుకు ప్రణాళిక సిద్ధం చేయాలి’

WGL: నగరంలోని 66 డివిజన్ పరిధిలో నాలాల మార్కింగ్ పూర్తిగా, పక్కాగా చేపట్టాలని కలెక్టర్, ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయి ఆదేశించారు. నాలాల విస్తరణకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను గుర్తించి వాటి అంచనాలు రూపొందించాలని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించారు. గతంలో నాలాల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి, ఆక్రమణల తొలగింపుకు ప్రణాళిక సిద్ధం చేయలన్నారు.

March 18, 2026 / 11:16 AM IST

పన్నులు చెల్లిచాలని కమిషనర్ సూచన

NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి, నీటి పన్నులు, కాంప్లెక్స్ బకాయిలు చెల్లించి ప్రజలు పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జీ. శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఆస్తి పన్ను మొత్తం రూ.20.53 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.7.03 కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. బకాయిలు ఉన్నవారికి రెండుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

March 18, 2026 / 11:15 AM IST

చిన్నగంజాంలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన MRO

 BPT: చిన్నగంజాం మండలంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఎమ్మార్వో ప్రభాకర్ రావు పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును ఆయన చీప్, ఇన్విజిలేటర్‌లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న మంచినీరు తదితర సౌకర్యాల గురించి ఎమ్మార్వో ప్రభాకర్ రావు ఆరా తీశారు. శాంతియుత వాతావరణంలో పరీక్షలు జరగాలని సూచించారు.

March 18, 2026 / 11:15 AM IST

అసెంబ్లీ నుంచి BRS ఎమ్మెల్యేల వాకౌట్

అసెంబ్లీలో మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పట్ల బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. పరివాహక ప్రాంత ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ప్రతిపక్ష ప్రశ్నలను దాటవేస్తోందని మండిపడుతూ నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సభను బహిష్కరించారు.

March 18, 2026 / 11:15 AM IST

శ్రమదానంతో రోడ్డుపనులు

ASR: హుకుంపేట మండలంలోని గొప్పుగరువులో గ్రామస్థులు శ్రమదానంతో రోడ్డుపనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో 40 కుటుంబాలు జీవిస్తున్నాయని, సరైన రోడ్డు సదుపాయం లేక రాక పోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. 104, 108 అత్యవసర సమయాల్లో రాలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సంభందిత అధికారులు రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

March 18, 2026 / 11:15 AM IST

తాగునీరు లేదు.. తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..!

KRNL: ఆదోనిలోని 2, 41వ వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. బాబాజీ పేట, శుక్రవారంపేట ప్రాంతాలకు నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కింది స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం, మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

March 18, 2026 / 11:14 AM IST

రైతులకు కూరగాయల విత్తనాలు పంపిణీ

NRPT: ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బుధవారం మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో రైతులకు ఉచితంగా కూరగాయ విత్తనాలు గ్రామ సర్పంచ్ కళ్యాణి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తూ విత్తనాలు పంపిణీ చేసి రైతులకు అండగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలే దామోదర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, హార్టికల్చర్ లింగరాజు ఉన్నారు.

March 18, 2026 / 11:12 AM IST

‘రోడ్ల విస్తరణ పేరిట ఇబ్బందులు పెట్టడం సరికాదు’

MNCL: మంచిర్యాలలో రోడ్ల విస్తరణ పేరిట పండుగల వేల వ్యాపారులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. బుధవారం ఆయన రోడ్లు విస్తరణ చేస్తున్న ప్రాంతాలను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పనులు చేయడం సరికాదన్నారు.

March 18, 2026 / 11:12 AM IST

ఆగిపోయిన సినిమాను మళ్లీ స్టార్ట్ చేసిన హీరో!

గోపీచంద్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ఆగిపోయిన దర్శకుడు కుమార్ సాయితో ప్రాజెక్టును ఆయన మళ్లీ పట్టాలెక్కిస్తున్నాడట. ఆర్థిక కారణాలతో నిలిచిపోయిన ఈ మూవీపై మేకర్స్ ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ నుంచి లండన్‌లో రెండు నెలలు కీలక షెడ్యూల్ జరగనున్నట్లు, మూవీలోని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించి, షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు టాక్.

March 18, 2026 / 11:12 AM IST

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ

 ప్రకాశం: పొగాకు కార్మికులకు రోడ్డు భద్రత, మహిళల రక్షణపై సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.

March 18, 2026 / 11:10 AM IST

పటిష్టంగా పదో తరగతి పరీక్షలు

KDP: సిద్ధవటంలోని ZP హైస్కూల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రెండో రోజు బుధవారం పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించబడ్డాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని నిబంధనలను పాటిస్తూ పరీక్ష రాశారు.

March 18, 2026 / 11:10 AM IST

పన్ను వసూలుకు మరికొన్ని రోజులు మాత్రమే.!

CTR: పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు.

March 18, 2026 / 11:09 AM IST

నారాయణపురంలో పారిశుద్ధ్య కార్యక్రమం

KRNL: నారాయణపురం గ్రామంలో సర్పంచ్ సరళమ్మ ఆధ్వర్యంలో ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని వీధి వీధి తిరిగి పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. మురికి కాలవలను శుభ్రపరిచి మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నారు. అంటువ్యాధులు, దోమలు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామ ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు.

March 18, 2026 / 11:07 AM IST

మల్లికార్జున స్వామి ఆలయ ఛైర్మన్‌గా రాజేశ్వరరావు

PDPL: ముత్తారం మండలం ఓడేడు గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ఛైర్మన్‌గా తీగల రాజేశ్వరరావు, వైస్ ఛైర్మన్‌‌‌గా కట్టేకోళ్ల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గ్రామస్థులు కమిటీ సభ్యులని ఎన్నుకున్నారు. తనపై బాధ్యత ఉంచిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

March 18, 2026 / 11:07 AM IST

వైఎస్ జగన్‌ను కలిసిన కొనుదుల రమేష్ రెడ్డి

ATP: YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడిపత్రి సీనియర్ నాయకుడు కొనుదుల రమేష్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు పలు సూచనలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు.

March 18, 2026 / 11:07 AM IST